తెలంగాణలో ఒక్కరోజే 2,479కేసులు..

by  |
తెలంగాణలో ఒక్కరోజే 2,479కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24గంటల్లో 2,479 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,47,642కు చేరుకుంది.

ఇందులో 31,654 యాక్టివ్ కేసులుండగా.. కొత్తగా 2,485 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన సంఖ్య 1,15,072 చేరుకుంది. గడచిన 24 గంటల్లో 10 మంది మృతి చెందగా.. తాజా మరణాలతో కలుపుకుని మొత్తం కరోనా మృతుల సంఖ్య 916 కు చేరింది. కాగా, గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 62,649 టెస్టులు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య 18,90,554 కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.


Next Story

Most Viewed