తెలంగాణ కేబినెట్ మీటింగ్ స్టార్ట్

by  |
తెలంగాణ కేబినెట్ మీటింగ్ స్టార్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

కొత్త సచివాలయ నమూనాకు ఆమోదం తెలపనున్నారు. అదేవిధంగా నియంత్రిత వ్యవసాయ విధానం అమలు, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, విద్యా రంగం, ఏపీతో జలవివాదాలు, అపెక్స్ కౌన్సిల్ అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఆయుష్ డాక్టర్ల వయోపరిమితి పెంపు ఆర్డినెన్స్ కు మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.



Next Story