డ్రోన్‌లతో పొలాల్లో పురుగుమందు పిచికారీ.. రైతుల కోసం కొత్త టెక్నాలజీ..

by Sumithra |
డ్రోన్‌లతో పొలాల్లో పురుగుమందు పిచికారీ.. రైతుల కోసం కొత్త టెక్నాలజీ..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు రైతులు వ్యవసాయం పనుల్లో బిజీగా ఉండిపోతారు. ఉదయం లేచినప్పటి నుంచి పంట దిగుబడి కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే రైతులు పొలానికి నీళ్లు పెట్టే సమయంలో, పురుగుల మందులు స్ప్రే చేసే సమయంలో జాగ్రత్తలు వహించాలి. పురుగుల మందులు పొలాల్లో పిచికారీ చేయడానికి అక్కడ, ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు. అందుకోసం సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. మరి ఆ టెక్నాలజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భూమీట్ యాప్ ద్వారా మీరు ఇంట్లో కూర్చొని డ్రోన్ స్ప్రేయింగ్ సేవను పొందవచ్చు. ఈ యాప్ రైతులను, డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్లను కలుపుతుంది. తద్వారా రైతులు తమ పొలాల్లో పురుగుమందులను డ్రోన్‌ల ద్వారా సులభంగా పిచికారీ చేయవచ్చు. పంటను తగు జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి రైతు బాధ్యత. తెగుళ్లు సోకి పంటకు నష్టం వాటిల్లుతుంది. ఇటువంటి సందర్భాల్లో, రైతులు తరచుగా పురుగు మందులు ఉపయోగిస్తారు. కానీ పెద్ద పొలాల్లో, ప్రతి మూలకు చేరుకోవడం, పిచికారీ చేయడం చాలా కష్టమైన పని. అందువల్ల ఈ రోజుల్లో డ్రోన్‌లతో స్ప్రే చేసే ధోరణి వేగంగా పెరుగుతోంది. మీరు కూడా డ్రోన్ల ద్వారా మీ పొలాల్లో పురుగుమందులను పిచికారీ చేయాలనుకుంటే, భూమీత్ మీకు సహాయం చేస్తుంది.

ప్యాసింజర్ డ్రోన్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ (PDRL) భూమీట్, సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (SaaS) ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. ఇది రైతులు, డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్లను ఒకదానితో ఒకటి కలుపుతుంది. దీని ద్వారా రైతులు డ్రోన్ సేవలను పొందేందుకు డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించవచ్చు. భూమీట్ యాప్ ద్వారా దీన్ని చేయడం చాలా సులభం.

భూమీట్ యాప్ 6 భాషల్లో పని చేస్తుంది..

డ్రోన్‌లను ఉపయోగించడం చాలా మంది రైతులకు కొత్త విషయంగానే అనిపిస్తుంది. అందువల్ల రైతులు తమ అవసరాలకు అనుగుణంగా సేవలను సులభంగా బుక్ చేసుకునే విధంగా భూమీట్ యాప్ రూపొందించారు. ఈ యాప్ సేవను పొందేందుకు, మీరు పేరు, మొబైల్ నంబర్ మాత్రమే ఇచ్చి నమోదు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల సౌలభ్యం కోసం, ఈ యాప్ ఇంగ్లీష్, హిందీతో సహా మొత్తం 6 భాషలలో పనిచేస్తుంది.

డ్రోన్ టెక్నాలజీ వల్ల రైతులకు ప్రయోజనం..

PDRL వ్యవస్థాపకుడు, CEO అయిన అనిల్ చందాలియా మాట్లాడుతూ "రైతులు, విశ్వసనీయ (డ్రోన్) సర్వీస్ ప్రొవైడర్ల మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా, భూమీట్ కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, డ్రోన్ మేక్స్ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా వ్యవసాయ సమాజానికి శక్తినిస్తుందంటున్నారు."

పీడీఆర్‌ఎల్ వ్యవస్థాపకుడు, సీటీఓ విశాల్ ధరంకర్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశం, గుజరాత్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాలలో ఈ యాప్ ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఇది 2024 చివరి నాటికి భారతదేశం అంతటా విస్తరించారు.

భూమీట్ ప్రయోజనాలు..

భూమీట్ యాప్ ద్వారా రైతులు నేరుగా లబ్ది పొందవచ్చు. ఇది పొలాలను పిచికారీ చేయడానికి ఖర్చు, సమయం రెండింటినీ ఆదా చేస్తుంది. ఈ యాప్ డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్లకు నిర్వహణను సులభతరం చేస్తుంది. డ్రోన్ మేనేజ్‌మెంట్, టీమ్ మేనేజ్‌మెంట్, స్టోర్ మేనేజ్‌మెంట్ వంటి సేవలు ఈ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంటాయి. దాని సహాయంతో డ్రోన్ల ద్వారా స్ప్రేయింగ్ లేదా సర్వేయింగ్ కోసం అభ్యర్థనలను ట్రాక్ చేయవచ్చు.

డ్రోన్‌తో ఎకరం విస్తీర్ణంలో పిచికారీ చేయడానికి సగటున రూ.500 నుంచి రూ.600 ఖర్చవుతుందని కంపెనీ పేర్కొంది. అయితే డ్రోన్ సేవలను అందించే కంపెనీ రైతులకు చార్జీలను నిర్ణయిస్తుంది. అలాగే డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్ల నుండి మొత్తం టర్నోవర్‌ పై PDRL 6.5 శాతం వసూలు చేస్తుంది. మీరు Google Play Store నుండి BhuMeet ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ iOS వెర్షన్ త్వరలో ప్రారంభిస్తారు.

Advertisement

Next Story

Most Viewed