టీడీపీ నూతన కమిటీల ప్రకటన..ఎప్పుడంటే…

by  |
టీడీపీ నూతన కమిటీల ప్రకటన..ఎప్పుడంటే…
X

దిశ వెబ్ డెస్క్ :
టీడీపీ నూతన కమిటీలను చంద్రబాబు ఆదివారం ప్రకటించనున్నారు. ఈ సారి సరికొత్త ప్రయోగంతో టీడీపీ ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్లమెంట్ పార్టీ వ్యవస్థకు టీడీపీ శ్రీకారం చుట్టనుంది. ఇప్పుడు ఉన్న జిల్లా కమిటీలో స్థానంలో పార్లమెంట్ కమిటీలు పనిచేయనున్నాయి. మొత్తం 25 మంది పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులను ,13 జిల్లాలకు సమన్వయ కర్తలను చంద్రబాబు నియమించనున్నారు. ఇక ఈ సారి కమిటీల్లో యువకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇక రాష్ట్ర కమిటీని కూడా త్వరలోనే చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed