- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : రాష్ట్రంలో పిచ్చిబ్రాండ్లు, అనామక మద్యం సేవించి చాలా మంది మరణిస్తున్నారని, ఎందరో మహిళల తాళిబొట్లు తెగుతున్నా సీఎం జగన్ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాడని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రే మద్యాన్ని నిత్యావసర వస్తువుగా మార్చారని మండిపడ్డారు.
ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తుండటంతో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోందని ఆరోపించారు. మద్యంపై కొత్తగా విధిస్తున్న జే టాక్స్ ద్వారా ప్రభుత్వం కంటే జగన్ కే రెట్టింపు ఆదాయం వస్తుందన్నారు. నాసిరకం మద్యం తాగి నిరుపేదలు ప్రాణాలు కోల్పోతున్నారని, వారి భార్యల తాళిబొట్లు తెగుతున్నా జగన్ ఎందుకు పట్టనట్లు ఉంటున్నారని ప్రశ్నించారు. సంవత్సరానికి 20 శాతం చొప్పున మద్యం దుకాణాలను తగ్గిస్తానని చెప్పిన జగన్ ఎందుకు నేడు మాట తప్పారు? ఇకనైనా మద్యపాన నిషేధంపై మీ కపట నాటకాలు, కొంగ జపాలు కట్టిపెట్టి బాధిత మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.