ఉపాధిహామీ అధికారులపై టీడీపీ నేతల దాడి

by  |
ఉపాధిహామీ అధికారులపై టీడీపీ నేతల దాడి
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌లు రెచ్చిపోయారు. శాంతిపురంలో ఉపాధి హామీ ఏపీఓ అశోక్‌రెడ్డిని చిత‌క‌బాదారు. ఆఫీసులోని కంప్యూట‌ర్లను ధ్వంసం చేసి అడ్డొచ్చిన ఎంపీడీఓ చెన్నయ్యపై చంద్రబాబు పీఏ మనోహర్ చేయి చేసుకున్నాడు. టీడీపీ నేత‌ల తీరుపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘ‌ట‌న‌లో 11మందిపై కేసు న‌మోదు చేశారు. టీడీపీ నేత‌ల దాడిని వైఎస్సార్‌సీపీ ఇన్​చార్జి భ‌ర‌త్ తీవ్రంగా ఖండించారు.


Next Story

Most Viewed