- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముషీరాబాద్: రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లలో స్వతంత్రంగా పోటీ చేస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు. కవాడిగూడలోని హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాయకులతో ఆయన సమావేశమయ్యారు. పొత్తులతో ఇప్పటికే పార్టీ చాలా నష్టపోయిందని కార్యకర్తలు సమావేశంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం రమణ మాట్లాడుతూ… పార్టీ కోసం పనిచేసే నాయకులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి సోమవారం పార్టీ కార్యాలయంలో నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.
Next Story