- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ వెబ్ డెస్క్: మంత్రి కొడాలి నానిపై టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి తీవ్రంగా మండి పడ్డారు. మంత్రి నాని ఫోటోలకు మహిళలు శవయాత్ర చేయడం చూశాక ఆయనలో డిప్రెషన్ పెరిగిపోయిందన్నారు. న్యాయంగా,ధర్మంగా మాట్లాడేవారంతా పందులు, కుక్కల్లాగా ఆయనకు కనిపిస్తున్నారని ఆమె అన్నారు. నిక్కర్లు వేసుకునే వయస్సు నుంచే చంద్రబాబును చూశానని నానీ చెబుతున్నారని అన్నారు. దీంతో చంద్రబాబు ముందు ఆయన ఓ బాతు బచ్చా అని తనకు తానే ఒప్పుకుంటున్నారని తెలిపారు. గతంలో జగన్, వైఎస్ఆర్ లను విడదల రజని, రోజా వంటి నాయకులు ఏమన్నారో నానికి తెలియదా అని ప్రశ్నించారు.
రాజధాని రైతులకు పేదలకు మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వం పబ్బం గడుపుకోవాలని చూస్తోందన్నారు. నిజంగా పేదలపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే రాజధానిలో వారికోసం చంద్రబాబు కట్టించిన 5వేల ఇండ్లను వారికి ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు.
జగన్ సర్కార్ అమ్ముతున్న ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్ తాగి నాని ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు .అలా మాట్లాడితే మహిళలు చీపుళ్లతో కొట్టరా అని ప్రశ్నించారు. అర్థరాత్రి రోడ్లపై తిరిగే ఆడవాళ్లతో తన దిష్టి బొమ్మలు దహనం చేయించారని మంత్రి నాని అంటున్నారని తెలిపారు. తన ఇద్దరు కూతుళ్లను కూడా నానీ అలాగే తిప్పుతున్నాడా అని ఆమె అన్నారు.