మీరు మాట తప్పారు.. మడమ తిప్పారు

by  |
మీరు మాట తప్పారు.. మడమ తిప్పారు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత దేవినేని ఉమ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన జగన్ కు పలు ప్రశ్నలు సంధించారు. పోలవరం కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసిన డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని… 22 మంది ఎంపీలను పెట్టుకుని ప్రభుత్వం ఖర్చు చేసిన ఆ నిధులను ఢిల్లీ నుంచి తెచ్చారా? అని ప్రశ్నించారు. మీరు పూర్తి చేస్తారనేది చంద్రబాబు 70 శాతం పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టా? లేక మీ మంత్రి చెప్పిన 20 శాతం ప్రాజెక్టా? అని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం విషయంలో మాట తప్పారంటూ మండిపడ్డారు.



Next Story

Most Viewed