ఉచిత విద్యుత్ రైతుల హక్కు : చంద్రబాబు

by  |
ఉచిత విద్యుత్ రైతుల హక్కు : చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉచిత విద్యుత్ పేరుతో ప్రభుత్వం నాటకాలాడుతోందని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నగదు బదిలీ కాదు.. రైతుల మెడకు అది ఉరితాడు అని చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాలు రైతులపాలిట గుదిబండగా మారాయన్నారు. ఉచిత విద్యుత్ రైతుల హక్కు అని అన్నారు. ప్రభుత్వం తక్షణమే జీవో 22ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed