స్టార్ హోటల్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు…

by  |
స్టార్ హోటల్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు…
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైద్రాబాద్ రోడ్‌లోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్‌పై మంగళవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ నరేందర్ ఆధ్వర్యంలో హోటల్‌లో పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురిని అరెస్ట్ చేశారు.

వారు నర్సింహరాజు, వేంకటేశ్వర రావు, శ్రీనివాస్, కరణ్ సింగ్, రాజేశ్వర్, సంతోష్, సంతోష్ కుమార్, వెంకట రమణ, లింబారెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 సెల్ ఫోన్‌లు, రెండు బైక్‌లు, రూ.69,060 లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హోటల్ నిర్వహకులపై, పేకాట ఆడుతున్న వారిపై నాల్గొ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.


Next Story