తమిళనాడులో లాక్‌డౌన్ పొడిగింపు

by  |
తమిళనాడులో లాక్‌డౌన్ పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా విజృంభిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వచ్చేవారికి ఈ-పాస్ నిబంధనను తప్పసరి చేసింది. జిల్లాల మధ్య రాకపోకలకు సంబంధించిన ఈ-పాస్ విధానాన్ని రద్దు చేసింది.

అయితే మెట్రో సర్వీసులకు పచ్చజెండా ఊపింది. వచ్చే నెల 7 నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో భక్తులకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా, కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించరాదని.. అన్ లాక్ 4.0లో కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed