స్వామిగౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

by  |
స్వామిగౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులుగా తన అసంతృప్తిని బయటకు చెప్పుకు వస్తున్న ఆయన మరోసారి మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కారులను పట్టించుకోవడం లేదని, పార్టీ మారిన కొంతమంది నేతలు ఉద్యమకారులపై పెత్తనం చలాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ అపాయింట్‌మెంట్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నానని, పార్టీ మారే ప్రసక్తే లేదు, పార్టీపై నాకు ఎలాంటి కోపం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీలో అందర్నీ కలుపుకొని పోయేలా కేసీఆర్ ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని తాను చెప్పిన మాట నిజమేనని తెలిపారు.


Next Story

Most Viewed