అనుమానాస్పదంగా రైల్వే ఉద్యోగి మృతి..!

by  |
అనుమానాస్పదంగా రైల్వే ఉద్యోగి మృతి..!
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం రైల్వే ట్రాక్‌పై రైల్వే ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైల్వే ఉద్యోగి అజయ్ కుమార్ అశ్వాపురం స్టేషన్‎లో పనిచేస్తున్నారు. గురువారం ఉద‌యం ట్రాక్ వెంబ‌డి విధులు నిర్వ‌ర్తిస్తున్న సిబ్బంది.. మృతి చెందిన అజ‌య్‌ కుమార్‎ను గమనించారు. ఘటనాస్థలికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story