బాలుతో 55 ఏళ్ల అనుబంధం : సుశీలమ్మ

by  |
బాలుతో 55 ఏళ్ల అనుబంధం : సుశీలమ్మ
X

దిశ, వెబ్‌డెస్క్: గాయకురాలు సుశీలమ్మ బాలు మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. 55 ఏళ్లుగా కలిసి పాడుతూనే ఉన్నామని.. బాలు మరణ వార్త విన్నాక లోయలో పడిపోయినట్లుగా అనిపించిందని అన్నారు. కరోనా వేటాడి వేటాడి తనను తీసుకుపోయిందని కన్నీరు పెట్టుకున్న సుశీలమ్మ.. బాలు పాటలతో ఇండస్ట్రీ ఇన్నాళ్లు కళకళలాడిందని పేర్కొన్నారు. బాలు లాంటి గొప్ప వస్తువు మన దగ్గర ఉందని కన్నుకుట్టి, మృత్యుదేవత బాలుని తన వెంట తీసుకుని వెళ్లిందని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుశీలమ్మ.. అశ్రునివాళి అర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.



Next Story

Most Viewed