వాహ్.. మీకెవరూ సరిలేరు

by  |
వాహ్.. మీకెవరూ సరిలేరు
X

దిశ, హుస్నాబాద్: వారందరిదీ ఒకే గ్రామం.. వాళ్లకు ఓ వేదిక ఉంది. అందులో ఒకరు ఇటీవలే మృతిచెందాడు. అయితే, అతడిది నిరుపేద కుటుంబం. అతడు ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో మృతుడి కుటుంబానికి సాయమందించాలని అనుకున్నారు. అనుకున్నట్లుగా సాయం చేసి సరిలేరు మీకెవ్వరనిపించారు.

వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా మద్దూర్ పట్టణానికి చెందిన కాటం రమేశ్ ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు వాట్సాప్ గ్రూపు సభ్యులు రూ.31 వేల ఆర్థిక సాయం బుధవారం అందజేశారు. పేద కుటుంబాన్ని ఆదుకున్నా మద్దూర్ గ్రూప్ సభ్యులను గ్రామస్తులు అభినంధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ దామెర మల్లేశం, సింగిల్ విండో డైరక్టర్ శేఖర్, గ్రూపు సభ్యులు రాజు, భిక్షపతి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed