తృటిలో తప్పిన ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన సూపర్ లగ్జరీ బస్సు

by Sridhar Babu |
తృటిలో తప్పిన ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన సూపర్ లగ్జరీ బస్సు
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లాలోని తల్లంపాడు వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ముందు వెళ్తున్న ఆటోను ఓవర్ టెక్ చేయబోయి అదుపు తప్పింది. దీంతో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Advertisement
Next Story

Most Viewed