పంట పండిందంటున్న సన్నీ లియోన్

by  |
పంట పండిందంటున్న సన్నీ లియోన్
X

బాలీవుడ్ హాట్ బాంబ్ స‌న్నీ లియోన్.. త‌న భ‌ర్త డానియ‌ల్ వెబ‌ర్, పిల్ల‌లు నిషా, నోవా, అష‌ర్‌తో క‌లిసి యూఎస్‌కు వెళ్లిన‌ట్టు త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. మొన్న‌టి వ‌ర‌కు ముంబైలోనే ఉన్న సన్నీ లియోన్ లాక్‌డౌన్ వేళ.. యూఎస్ ఎలా వెళ్లగలిగిందని నెటిజన్లు తెగ ఆలోచించారు. అయితే ముంబైలో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతోనే యూఎస్‌కు వెళ్లినట్లు సన్నీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కాగా, ప్ర‌స్తుతం లాస్ ఏంజిల్స్‌లో తమ ఇంట్లోని సీక్రెట్ గార్డెన్‌లో సుర‌క్షితంగా ఉన్నామని వెల్లడించిన ఈ హాట్ గర్ల్.. తాజాగా తన ఫార్మ్ ఫొటోలు ఇన్‌స్టా‌లో షేర్ చేసింది.

తన భర్త వెబర్‌తో కలిసి తమ ఫార్మ్‌లో బిజిబిజీగా గడుపుతున్న సన్నీ.. ‘తమ పొలంలో పండిన కూరగాయలను తెచ్చుకుని, వంట చేసుకుంటున్నట్టు’ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సన్నీ లియోన్ చేతిలో ‘వీరమ దేవి’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉంది. ఈ సినిమా కొన్ని నెలల క్రితమే లాంచ్ అయినప్పటికీ తర్వాత ఈ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. వీసీ వడివుడైయన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సన్నీలియోన్ వీరనారిగా కనించనున్న ఈ చిత్రం.. తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.



Next Story