- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలోనే ఇండియాను విడిచి అమెరికా వెళ్లింది బాలీవుడ్ భామ సన్నీ లియోన్. భర్త, పిల్లలతో కలిసి లాక్ డౌన్ను ఎంచక్కా ఎంజాయ్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యామిలీతో గడుపుతున్న ఫొటోలు షేర్ చేస్తున్న సన్నీ.. అసలు అమెరికా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో వివరించింది. ముంబైని చాలా మిస్ అవుతున్నానని.. ముంబై విడిచి వెళ్లడం బాధగా ఉందని చెప్పింది. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లోనే భర్త డేనియల్ వెబర్, పిల్లలతో కలిసి అమెరికా పయనం అయ్యానని చెప్పింది.
అమెరికాలోనే భర్త కుటుంబీకులు ఉన్నారని.. తన అత్త చాలా పెద్ద వయస్కురాలని తెలిపింది. విపత్కర సమయాల్లో తనను అలా వదిలేయడం సరికాదనే ఆలోచనతో తన దగ్గరికి వచ్చామని చెప్పింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందన్న సన్నీ.. అంతర్జాతీయ విమానసేవలు అందుబాటులోకి రాగానే ముంబై వచ్చేస్తానని చెప్పింది.