అమరావతిపై సుజనా హాట్ కామెంట్స్

by  |
అమరావతిపై సుజనా హాట్ కామెంట్స్
X

దిశ, అమరావతి: అమరావతి రాజధాని అంగుళం కూడా కదలదని, కేంద్రం స్పందించే సమయం ఇంకా రాలేదని రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి అన్నారు. అమరావతిపై కేంద్రం సరైన సమయంలో స్పదిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ వ్యవహారంలో భాగంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలిసానన్నారు. వ్యక్తులు వేరు, వ్యవస్థలు వేరన్న విషయం వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయం ఆపార్టీ అంతర్గత వ్యవహారమని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. మూర్ఖత్వంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తోందని మండి పడ్డారు.


Next Story