ప్రాణం తీసిన ఆన్‎లైన్ బెట్టింగ్..!

by  |
ప్రాణం తీసిన ఆన్‎లైన్ బెట్టింగ్..!
X

దిశ, మానకొండూరు: ఆన్‎లైన్ బెట్టింగ్ మోజులో యువత భవిత నాశనం అవుతోంది. బెట్టింగ్‎లో డబ్బులు పొగొట్టుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్‎కు చెందిన శివనాధుని నితీష్ ఆన్‎లైన్ బెట్టింగ్ గేమ్‎లో డబ్బులు పొగొట్టుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన నితీష్ అల్గునూరు కాకతీయ కెనాల్‎లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.


Next Story