- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రూ. 5 వేలు ఇవ్వొద్దు.. ఆఫీస్కు వచ్చి తీసుకోండి: అధికారులు
by Shyam |

X
దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కేంద్రంలో డ్రైవింగ్ స్కూళ్లలో బుధవారం రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం స్కూల్స్ నిర్వహిస్తున్నారా లేదా అనే వివరాలను సేకరించారు. ఈ తనిఖీల్లో భాగంగా 8 డ్రైవింగ్ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా 2 మోటార్ డ్రైవింగ్ స్కూళ్లను సీజ్ చేశారు. ఈ దాడుల్లో రవాణాశాఖ అధికారి శ్యామ్ నాయక్, ఎంవీఐ అభిలాశ్ లు పాల్గొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం రూ. 5000 ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని, ప్రజలు నేరుగా అఫిస్ కు వచ్చి లైసెన్స్ తీసుకోవాలని అధికారులు సూచించారు.
Next Story