వారికి బెంగళూరుపై అమితమైన ఆసక్తి..

by  |
వారికి బెంగళూరుపై అమితమైన ఆసక్తి..
X

దిశ, వెబ్‌డెస్క్ :

దేశంలో ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే వారికి కర్ణాటక రాజధాని బెంగళూరు ఫస్ట్ చాయిస్‌గా నిలుస్తోంది. విద్యార్థుల్లో దాదాపు మూడో వంతు మంది బెంగళూరులోనే చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ‘క్యూఎస్ ఐ-గేజ్’ సర్వే వెల్లడించింది.

దాదాపు 31శాతం మంది యువత బెంగళూరుపై ఆసక్తి చూపించగా.. ఆహ్లాకదర వాతావరణం, భద్రత, మౌళిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాల వల్ల యువత ఆ నగరం వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నట్లు సర్వే సంస్థ తెలిపింది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చదివేందుకు 26శాతం మంది విద్యార్థులు ఆసక్తి చూపించినట్లు సర్వేలో వెల్లడైంది.


Next Story