శ్రీశైలం ప్రమాదంలో రూ.100కోట్ల నష్టం..!

by  |
శ్రీశైలం ప్రమాదంలో రూ.100కోట్ల నష్టం..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలోని ఎడమగట్టులో జరిగిన అగ్నిప్రమాదంలో 9మంది సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటన వల్ల సంభవించిన నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసింది. దీని విలువ సుమారు రూ.100 కోట్లుగా అంచనా వేస్తోంది. విద్యుత్ కేంద్రంలోని ఆరో యూనిట్ ప్యానల్ బోర్డు పూర్తిగా దగ్ధం కాగా.. మూడు, నాలుగు యూనిట్లకు పాక్షికంగా నష్టం వాటిల్లినట్లు సమాచారం.

ఇదిలాఉండగా, విచారణ కమిటీ బృందం, సిబ్బందితో తెలంగాణ జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు భేటి అయ్యారు. ప్రమాదం జరిగిన తీరు, దాని తీవ్రత, మిగతా పంప్ హౌజ్‌ల నాణ్యాతా వివరాలను ఆయన సేకరించినట్లు తెలుస్తోంది.



Next Story