ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంక్‌కు స్మృతి మంధాన

by Harish |
Smriti Mandhana
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వన్డే ర్యాంకింగ్స్‌లో తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంది. మంగళవారం ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. బ్యాటింగ్ విభాగంలో స్మృతి మంధాన రెండు స్థానాలు ఎగబాకి 3వ ర్యాంక్‌కు చేరుకుంది. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో మంధాన సెంచరీతో సంచలన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో ఆమె ర్యాంక్‌ మెరుగుపడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 11వ స్థానంలో ఉండగా.. ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్ మూడేసి చొప్పున స్థానాలను అధిగమించి 20వ, 38వ ర్యాంక్‌లకు చేరుకున్నారు.

ఇంగ్లాండ్‌కు చెందిన స్కివర్ బ్రంట్ టాప్ పొజిషన్‌ను ఆక్రమించగా.. అగ్రస్థానంలో ఉన్న శ్రీలంక బ్యాటర్ ఆటపట్టు రెండో స్థానానికి పడిపోయింది. బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ ఒక్క స్థానం మెరుగుపర్చుకుని 4వ ర్యాంక్‌కు చేరుకోగా.. రేణుక సింగ్ మూడు స్థానాలు, పూజ వస్త్రాకర్ ఆరు స్థానాలు ఎగబాకారు. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ 6వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. పూజ వస్త్రాకర్ 4 స్థానాలు వెనక్కినెట్టి 18వ స్థానానికి చేరుకోగా.. రేణుక సింగ్ 5 స్థానాలను మెరుగుపర్చుకుంది.

Advertisement

Next Story

Most Viewed