క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన శ్రీలంక ప్లేయర్

by Mahesh |
క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన శ్రీలంక ప్లేయర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించిన రికార్డులు శ్రీలంక యువ ప్లేయర్ సాధించారు. ఇటీవల జట్టులోకి అరంగేట్రం చేసిన కమిందు మెండిస్.. ప్రపంచ రికార్డు సృష్టించాడు. శ్రీలంక వేదికగా న్యూజిలాండ్ తో రెండో టెస్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచులో 56 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో అర్థ సెంచరీ సాధించాడు. దీంతో టెస్టుల్లో వరుసగా ఎనిమిది 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ గా కమిందు మెండిస్ నిలిచాడు. అతనికంటే ముందు పాకిస్తాన్ కు చెందిన సౌద్ షకీల్.. వరుసగా ఏడు టెస్టుల్లో 50 ప్లస్ స్కోరు చేసిన ప్లేయర్‌గా నిలవగా ప్రస్తుతం ఈ రికార్డును కమిందు మెండిస్ బ్రేక్ చేసి.. సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

Advertisement

Next Story

Most Viewed