భారత్ - బంగ్లాదేశ్‌ రెండో టెస్టు మూడో రోజు ఆట రద్దు

by Y. Venkata Narasimha Reddy |
భారత్ - బంగ్లాదేశ్‌ రెండో టెస్టు మూడో రోజు ఆట రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టు మూడో రోజు ఆట కూడా రద్దైంది. రెండోరోజు మాదిరిగానే మూడో రోజు కూడా ఒక్క బంతి పడకుండానే ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇవాళ వర్షం లేకపోయినా.. మైదానం చిత్తడిగా ఉండటంతో ఆట నిర్వహణకు సాధ్యపడలేదు. మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అంపైర్లు చివరకు మధ్యాహ్నం 2గంటలకు మరోసారి పరిశీలించి ఆటను రద్దు చేశారు. ఈ మ్యాచ్ లో తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 107/3 స్కోరుతో కొనసాగుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్​ డ్రాగా ముగిసినట్లయితే ఈ సిరీస్​ను టీమ్ఇండియా 1-0తో కైవసం చేసుకుంటుంది. కానీ, ఈ మ్యాచ్ రద్దైనా, డ్రాగా ముగిసినా భారత్​కు 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed