భారత్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లా జట్టు ఎంపిక.. 14 నెలల తర్వాత జట్టులోకి వచ్చిన కీలక ప్లేయర్

by Harish |
భారత్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లా జట్టు ఎంపిక.. 14 నెలల తర్వాత జట్టులోకి వచ్చిన కీలక ప్లేయర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాతో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదివారం తమ జట్టును ప్రకటించింది. శాంటో కెప్టెన్సీలో 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. మెహిది హసన్ మిరాజ్ 14 నెలల తర్వాత తిరిగి టీ20 జట్టులో చోటు సంపాదించాడు. చివరిసారిగా గతేడాది జూలైలో అఫ్గానిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాడు. బ్యాటర్ పర్వేజ్ హుస్సేన్ ఎమాన్, స్పిన్నర్ రకీబుల్ హసన్‌లు కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. పాక్‌తో రెండో టెస్టులో గాయపడి భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన పేసర్ షోరిఫుల్ ఇస్లాం టీ20లకు అందుబాటులోకి రానున్నాడు. టెస్టు జట్టు నుంచి ఐదుగురు టీ20లకు ఎంపికయ్యారు. భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, వచ్చే నెల 6న తొలి టీ20 జరగనుంది.

బంగ్లాదేశ్ జట్టు : శాంటో(కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమాన్, తౌహిద్ హృదయ్, మహముదుల్లా, లిటాన్ దాస్, జాకెర్ అలీ, మెహిది హసన్ మిరాజ్, మహేది హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిమ్ హసన్ షకీబ్, రకీబుల్ హసన్.

Advertisement

Next Story

Most Viewed