- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, దేవరకొండ: తాగేందుకు డబ్బులివ్వలేదనే కోపంతో ఓ యువకుడు కన్నతల్లిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటన దేవరకొండ పరిధిలోని పీఏ పల్లి మండలంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.వివరాల్లోకివెళితే…పెద్ద ఆడిషర్లపల్లి మండలం బాలాజీనగర్ కు చెందిన మెగావత్ బుజ్జి (48)కు నలుగురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. చిన్నవాడైన మున్నా(21) మద్యానికి , పేకాటకు బానిసై జులాయిగా తిరిగేవాడు. తన అక్కకు కళ్యాణలక్ష్మి డబ్బులు రాగా ఇంట్లో నుంచి రోజు కొంత తీసుకెళ్ళేవాడు. ఈ క్రమంలోనే సోమవారం డబ్బులివ్వాలని అడగ్గా తల్లి అందుకు విభేదించింది. దీంతో కోపోద్రిక్తుడైన మున్నా పక్కనే ఉన్న రోకలితో తల్లి తలపై బలంగా మోదాడు. తీవ్రరక్తస్రావం కావడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.