- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జున సాగర్ జలాశయంలోకి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతన స్మార్ట్ బోటును శుక్రవారం తీసుకొచ్చారు. సాగర్ జలాశయం పర్యాటకులను నంది కొండకు తీసుకెళ్లేందుకు 60 సీట్ల సామర్థ్యం ఉన్న బోటును విశాఖపట్నం నుంచి సాగర్కు తెచ్చారు. బోటుకు తుది మెరుగులు దిద్ది..
త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు లాంచీ స్టేషన్ అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో నాగార్జున సాగర్ నుంచి లాంచీలను తిప్పడం లేదు. లాంచీ స్టేషన్లో ఇప్పటికే 150 మంది పర్యాటకుల సామర్థ్యం కలిగిన 2 లాంచీలు ఉండగా.. తక్కువ మందితో నంది కొండకు తిప్పడం కోసం ఈ నూతన బోటును ఏర్పాటు చేసినట్టు పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు.
Next Story