ఆరు వాటర్ ప్లాంట్లు సీజ్..!

by  |
ఆరు వాటర్ ప్లాంట్లు సీజ్..!
X

దిశ, పటాన్‌చెరు: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లను అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం గ్రామ పంచాయతీలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆరు వాటర్ ప్లాంట్లను తహశీల్దార్ దశరథ సీజ్ చేశారు. అనుమతి లేని వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని తహశీల్దార్ హెచ్చరించారు.


Next Story