ఆరుగురు జూదరుల అరెస్ట్..

by  |
ఆరుగురు జూదరుల అరెస్ట్..
X

దిశ, మునుగోడు: పేకాట ఆడుతున్న ఆరుగురు జూదరులను గురువారం చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాళ్లోకి వెళితే.. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలోని ధర్మోజిగూడెం గ్రామ శివారు నిర్మానుష్య ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో చౌటుప్పల్ సీఐ వెంకన్న తమ సిబ్బందితో దాడి చేయగా సంఘటనా స్థలంలో ఆరుగురు పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7400 నగదు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వెంకన్న తెలిపారు. అనంతరం వీరందరిపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.


Next Story