చౌటుప్పల్‌లో ఆరు పాజిటివ్ కేసులు

by  |
చౌటుప్పల్‌లో ఆరు పాజిటివ్ కేసులు
X

దిశ, మునుగోడు: చౌటుప్పల్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ విస్తృత వ్యాప్తిని చూసి స్థానిక తీవ్ర భయాదోళనకు గురవుతున్నారు. తాజాగా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 34 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. దీంతో వారు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అన్న విషయాలపై ఆరా తీసి, వారి సాంపుల్స్ పరీక్షలకు పంపే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.


Next Story