వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి

by  |
వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
X

దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. కోనారావుపేట మండలం నిజామాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తమ భూమిని వేరే‌వాళ్ల పేరు మీద అధికారులు పట్టా చేశారని శిరీష ఆరోపించింది. నెల రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టు కాళ్లు అరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని సదురు యువతి వాటర్ ట్యాంక్ ఎక్కింది. శిరీష కుటుంబానికి చెందిన మూడు ఎకరాల 17 గుంటల భూమిని అధికారులు వేరే వాళ్ల పేరు మీద అధికారులు పట్టా చేశారు. గత 30 సంవత్సరాలుగా ఈ భూమిని తామే సాగుచేసుకుంటున్నట్లు శిరీష తెలిపింది. ప్రస్తుతం అర్జున్ అనే వ్యక్తి అక్రమంగా తమ భూమిని పట్టా చేయించుకున్నట్లు శిరీష ఆరోపించింది. తన పేరు మీద భూమిని పట్టా చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని శిరీష వాటర్ ట్యాంక్ ఎక్కింది. దీంతో స్పందించిన అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో టాంక్ నుంచి కిందకు దిగింది.


Next Story

Most Viewed