- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో నివాసముంటున్న భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ముగ్గురు పిల్లల ప్రాణాలు కాపాడి, ఆ తర్వాత అతను చనిపోయాడు. ఈ ఘటన అక్కడ అందరినీ కలిచివేసింది. వివరాల్లోకివెళితే.. బుధవారం రాత్రి కాలిఫోర్నియాలోని కింగ్స్ నది ఒడ్డున పదేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. అనుకోకుండా అందులో పడిపోయారు.
ఆ సమయంలో అక్కడే ఉన్న మంజిత్ సింగ్ మరుక్షణం ఆలోచించకుండా నీటిలో దూకి వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. అయితే, నీటిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో దురదృష్టవశాత్తు అతను కొట్టుకుపోయాడు. రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టగా, దాదాపు 40నిమిషాల తర్వాత అతని మృతదేహం లభ్యమైంది.
Next Story