- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,సిద్ధిపేట: జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి ఆదేశించారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై అడిషనల్ కలెక్టర్లు, డీఆర్ డీఓ అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులతో సిద్దిపేట, మెదక్ కలెక్టర్ వెంకట్రామారెడ్డి సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… కరోనా నేపథ్యంలో వీధి వ్యాపారస్తులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రుణాలను జనాభాలో ఐదు శాతం మందికి బ్యాంకుల నుంచి అందే విధంగా ఇంటింటికి వెళ్లి అప్లికేషన్లు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. . అదేవిధంగా ఈ నెలాఖరులోగా రైతు వేదికలను నిర్మించి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పల్లె ప్రకృతి వనాల నిర్మాణం కోసం అవసరమైనటువంటి భూసేకరణ చేసే విధంగా ఆర్డీఓ తహసిల్దార్ లు చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల కోసం డ్రాయింగ్ ప్లాట్ ఫామ్స్ నిర్మాణాలను 15 రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పూర్తయిన వాటికి బిల్లులను మంజూరు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Read Also..