సిద్దిపేట బ్రాండ్‌తో పప్పుల విక్రయాలు షురూ

by  |
సిద్దిపేట బ్రాండ్‌తో పప్పుల విక్రయాలు షురూ
X

దిశ, వెబ్ డెస్క్: గ్రామీణ మహిళనలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారిని బిజినెస్ లో రాణించేలా మంత్రి హరీశ్‌రావు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా సిద్దిపేట బ్రాండ్ పేరిట రాష్ట్రంలో పప్పుల విక్రయాలకు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో మిట్టపల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ పప్పులను విక్రయించడానికి సర్వం సన్నద్ధం అయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి హరీశ్ రావే తన ట్వీట్టర్ వేదికగా ప్రకటించారు. 6 కిలోల బ్యాగ్ ధర రూ.500లుగా నిర్ణయించారు. మన పప్పులను మనం వాడుకుందాం. మన మహిళలను ప్రోత్సహిద్దాం. తోడ్పాటునిద్దాం అని మంత్రి హరీశ్‌రావు పిలుపు నిచ్చారు.


Next Story

Most Viewed