- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ను ఇష్టపడని వారుండరు. అందరినీ విష్ చేస్తూ.. అందరితో ఫ్రెండ్లీగా ఉండే తనంటే సెలబ్రిటీలకు మాత్రమే కాదు ప్రేక్షకులకు కూడా చాలా ఇష్టం. తన నుంచి ఎప్పుడెప్పుడు కొత్త సినిమా వస్తుందా? అని వెయిట్ చేసే ఫ్యాన్స్ మిలియన్స్లో ఉన్నారు. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే శ్రద్ధా.. ఇన్స్టాగ్రామ్లో 50 మిలియన్ ఫాలోవర్స్ను క్రాస్ చేసి రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలో తనపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఫొటోలు, వీడియోలు సెండ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఫ్యాన్స్.
దీంతో వారందరికీ థాంక్స్ చెప్తూ హార్ట్ఫెల్ట్ నోట్ షేర్ చేసింది శ్రద్ధా. అభిమానులను జెమ్స్గా పేర్కొంటూ లెటర్ రాసిన శ్రద్ధా.. వారి పోస్ట్లు, వీడియో ఎడిటింగ్స్ను షేర్ చేసింది. వీటన్నింటిని చూసి చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. మీ ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటానన్న సాహో భామ.. మీ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నానని చెప్పింది. కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. ప్రేమ, శాంతిని పంచాలని కోరింది. మరోసారి 50 మిలియన్ టైమ్స్ థాంక్స్ అంటూ ముగించింది.