ఏపీకి ప్రత్యేక హోదా ప్రజల హక్కు

by  |
ఏపీకి ప్రత్యేక హోదా ప్రజల హక్కు
X

దిశ, ఏపీ బ్యూరో​: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రజల హక్కు అని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. విశాఖలో ఆదివారం ఆయన మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ రెండు ముక్కలు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో అసమర్ధ, అరాచక పాలన సాగుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ప్రజలందరికీ అందుబాటులో ఉన్న రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వరసగా శిరోముండనం ఘటనలు జరగడం బాధకరమని వ్యాఖ్యానించారు.



Next Story