ఈనెల 21 నుంచి… ఆ శిక్షణా కేంద్రాలు ప్రారంభం

by  |
ఈనెల 21 నుంచి… ఆ శిక్షణా కేంద్రాలు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణా కేంద్రాలు కూడా మూతపడ్డాయి. కాగా ప్రభుత్వం ఇటీవల అన్‌లాక్ ప్రకృయ మొదలు పెట్టి, సడలింపులు ఇవ్వడంతో ఈ కేంద్రాలను సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభిస్తున్నట్టు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె. వేణుగోపాలరావు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.

శిక్షణా కేంద్రాల్లోకి ప్రవేశించే విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ మాస్కు తప్పక ధరించాలని సూచించారు. శిక్షణా కేంద్రాల్లోని తరగతి గదుల్లో 20 మందికి మించి విద్యార్ధులు ఉండరాదని, వారు కూడా భౌతిక దూరం పాటించాలని అన్నారు. కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి టెస్టులు చేయాలని తెలిపారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శిక్షణా కేంద్రాలకు సూచించారు.


Next Story

Most Viewed