చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్తత..

by Shyam |
చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్తత..
X

దిశ, న్యూస్ బ్యూరో : మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకివెళ్తె..నిషేధిత డ్రోన్‌ను ఎగురవేసిన కేసులో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్‌తో ములాఖత్ అయ్యేందుకు వెళ్లిన మాజీ కేంద్ర మంత్రి, సుప్రీంకోర్టు న్యాయవాది సల్మాన్ ఖురేషీద్, కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ, మల్లు రవిలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

Tags: charlapalli jail, mp revanth reddy, congress senior leaders, police

Next Story

Most Viewed