లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్ హనుమంతరావు

by  |
లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్ హనుమంతరావు
X

దిశ, మెదక్: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో జిల్లాలోని ఎనిమిది పురపాలికల్లో నిబంధనలు ఉల్లంఘించిన 116 మందికి జరిమానాలు విధించినట్టు తెలిపారు. అంతేకాకుండా మాస్క్ ధరించకుండా బయటకు వచ్చిన 52 మందికి రూ. 5,200 జరిమానా విధించామన్నారు. పోలీసులకు చిక్కి జరిమానాలు చెల్లించినవారు ఇకమీదట అయినా రూల్స్ పాటించాలని, లేకపోతే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

tags : lockdown, rules break, sangareddy dist, collecter hanumantha rao


Next Story

Most Viewed