- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా, అధికారికంగా జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే నాటి చారిత్రక ప్రాంతాల సందర్శనలో భాగంగా యాదాద్రి జిల్లాకు మంగళవారం చేరుకున్నారు. జిల్లాలో అడుగుపెట్టిన బండి సంజయ్కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంజయ్కు బోనాలతో ఘన స్వాగతం పలికారు. సంజయ్ రెండ్రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు ఆలేరు మండలంలోని కొలనుపాక, రాజపేట మండలంలోని రేణికుంటను సందర్శించనున్నారు. ఆపై అక్కడి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సంజయ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
Next Story