SEP-25 టాలీవుడ్‌కు బ్లాక్ డే..!

by  |
SEP-25 టాలీవుడ్‌కు బ్లాక్ డే..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఇకమీదట సెప్టెంబర్-25వ తేదీ టాలీవుడ్ ఇండస్ట్రీకి బాగా గుర్తుండి పోతుంది. కారణం ఇద్దరు లెజెండరీ పర్సనాలిటీస్ అందరినీ విడిచి దూరంగా వెళ్లిపోయిన రోజు. 2020 సెప్టెంబర్ 25వ తేదీన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం మృతిచెందగా.. సరిగ్గా ఇదే రోజు ఏడాది కిందట అనగా 2019 సెప్టెంబర్ 25న కమెడియన్ వేణు మాధవ్ అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో లెజెండరీ కమెడియన్‌గా దాదాపు 400 సినిమాలకు పైగా నటించాడు.

ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిన సరిగ్గా ఏడాది తర్వాత ఇదే రోజు అనగా 25 సెప్టెంబర్ 2020న మరో లెజెండ్ ఎస్పీ బాలు మరణించడం టాలీవుడ్‌ను కన్నీటి సాగరంలో ముంచివేసింది. ఒకేరోజున ఇద్దరు స్టార్స్ ఇలా అయినవాళ్లను, అభిమానులను వదిలి వెళ్లిపోవడం నిజంగానే విషాదం. కొంచెం అటు , ఇటు కాకుండా సరిగ్గా ఒకే రోజున ఇద్దరు గొప్ప వ్యక్తులు కన్నుమూయడంతో సెప్టెంబర్ 25 నిజంగానే టాలీవుడ్‌కు బ్లాక్ డేగా మిగిలిపోనుంది.



Next Story