స్వల్ప లాభాలతో సరిపెట్టిన మార్కెట్లు

by  |
స్వల్ప లాభాలతో సరిపెట్టిన మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. అమెరికా మార్కెట్లలో నష్టాలు నమోదవడంతో ఆ ప్రభావం దేశీయ సూచీలపై ప్రతికూలంగా ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గురువారం నాటి భారీ లాభాల తర్వాత శుక్రవారం ప్రారంభమైన మార్కెట్లు రోజంతా ఊగిసలాటలో ట్రేడయ్యాయి. చివరి వరకూ ఇదే ధోరణిని కొనసాగించిన సూచీలు స్వల్ప లాభాలను నమోదు చేశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 14.23 పాయింట్ల లాభంతో 38,854 వద్ద ముగియగా, నిఫ్టీ (Nifty) 15.20 పాయింట్లు లాభపడి 11,464 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాలు సానుకూలంగా ట్రేడవ్వగా, ప్రైవేట్ రంగ బ్యాంకులు, మీడియా నీరసించాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌ (Sensex Index)లో ఎస్‌బీఐ, టీసీఎస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హిందూస్తాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, టైటాన్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, మారుతీ సుజుకి, నెస్లె ఇండియా షేర్లు నష్టాల్లో నమోదయ్యాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.53 వద్ద ఉంది.


Next Story