నష్టాలతో ముగిసిన మార్కెట్లు!

by  |
నష్టాలతో ముగిసిన మార్కెట్లు!
X

వరుసగా నాలుగు రోజులు లాభాలతో కొనసాగిన మార్కెట్లు వారం చివరి రోజు నష్టాలతో ముగిసింది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఆసియా మార్కెట్ల నష్టాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. సెనెక్స్ 164 పాయింట్ల నష్టంతో 41,141 వద్ద ముగిసింది. నిఫ్టీ 51 పాయింట్లను కోల్పోయి 12,151 వద్ద క్లోజయింది. ఎన్‌టీపీసీ అత్యధికంగా 3 శాతం పైగా లాభంతో ట్రేడయింది. ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, టీసీఎస్, హిందూస్తాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్ లాభాల్లో ట్రేడయ్యాయి. సున్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్ నష్టాలను చవిచూశాయి.


Next Story

Most Viewed