భారీగా రేషన్ బియ్యం పట్టివేత

by  |
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్-ఆర్మూర్ రోడ్‌లో మాణిక్ బండారు గ్రామం వద్ద అక్రమంగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ షాకీర్ అలీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. కోరుట్ల నుంచి రెండు ఐషర్ వాహనాల్లో తరలిస్తున్న 250 క్వింటాళ్ల రేషన్ బియ్యంను పట్టుకున్నారు. ఇద్దరు డ్రైవర్‌లను అదుపులోకి తీసుకొని వాహనాలను, బియ్యంను మాక్లూర్ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ దాడిలో ఒక్కసారి పెద్దమొత్తంలో పీడీఎస్ బియ్యం పట్టుబడటం ఇదే తొలిసారి. అనంతరం ఇద్దరు డ్రైవర్‌లపై కేసులు నమోదు చేసి విచారణకు మాక్లూర్ పోలీసులకు అప్పగించారు.


Next Story