పంచాయతీరాజ్ ఉన్నతాధికారులపై నిమ్మగడ్డ ఫైర్

by srinivas |
nimmagadda
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై అధికార వైసీపీ పార్టీ, ఎన్నికల కమిషన్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని SEC..ఇప్పుడే వద్దని ఏపీ ప్రభుత్వం భీష్మించుకు కూర్చున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకున్నా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

దీంతో కథ మళ్లీ అడ్డం తిరిగింది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ రాజ్ శాఖతో మధ్యాహ్నం 3గంటలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ మీటింగ్‌కు ఉన్నతాధికారులు ఎవరూ రాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఫైర్ అయ్యారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌కు మెమో జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed