నవంబర్‌లో మహేశ్ ‘సర్కార్ వారి పాట’ ప్రారంభం

by  |
నవంబర్‌లో మహేశ్ ‘సర్కార్ వారి పాట’ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సర్కార్ వారి పాట’. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. మూవీ షూటింగ్ పోర్షన్ ఎక్కువగా విదేశాల్లోనే ఉండగా..ఇప్పటికే అమెరికాకు చేరుకున్న మూవీ టీం షూటింగ్ లోకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉంది. నవంబర్ రెండో వారం నుంచి లాంగెస్ట్ ఫస్ట్ షెడ్యూల్ షురూ కానుంది. హీరో మహేశ్‌బాబుతోపాటు ఇతర నటీనటులు కూడా చిత్రీకరణలో పాల్గొనే అవకాశం ఉంది.

ఇక సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేయగా, డైరెక్టర్ పరశురామ్ కొన్ని ట్యూన్స్ ఫైనల్ చేసినట్లు సమాచారం. బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్న ఈ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ విద్యా బాలన్ ప్రిన్స్‌కు సోదరిగా ఇంటెన్స్ రోల్‌లో నటిస్తుంది. మహేశ్‌బాబు డబుల్ రోల్‌లో కనిపించడం సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తుండగా, సూపర్‌స్టార్ ఫ్యాన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అని అంటున్నారు.


Next Story

Most Viewed