గణేశ్ ఉత్సవాలకు అడ్డుంకులు సృష్టిస్తున్నారు

by  |
గణేశ్ ఉత్సవాలకు అడ్డుంకులు సృష్టిస్తున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు గణేశ్ ఉత్సవాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. లోపాయికారి అవగాహనతో కుట్రలు చేస్తున్న టీఆర్ఎస్, ఎంఐఎంలకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.

లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా ఉన్న సమయంలో రంజాన్ మాసంలో బిర్యానీలు, కాజు పిస్తాలు అందించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. కనీసం గణేష్ ఉత్సవాల సందర్భంగా పులిహోర నైవేద్యాన్ని సమర్పించే అవకాశాలు లేకుండా కుట్రలు చేస్తూ అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు.

ప్రస్తుతం కరోనా విజృంభిస్తోన్న తరుణంలో గణేశ్ ఉత్సవాలను జాగ్రత్తగా నిర్వహించుకోవడం మన బాధ్యత అన్నారు. ఈ సమయంలో ధార్మిక సంస్థలు, హిందూ, ఉత్సవ సమితితులు నిర్దేశించిన విధంగా ఉత్సవాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు, పోలీసుల నుంచి బెదిరింపులు ఎదరైతే హిందూ ధార్మిక సంస్థలు, బీజేపీని సంప్రదించాలన్నారు.


Next Story

Most Viewed